అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు బాగా క్రేజ్ ఏర్పడింది.తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం ఆ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా తరువాత టాక్సీవాలా, ‘డియర్ కామ్రేడ్స ,నోటా సినిమాలు లైన్లో ఉన్నాయి.వీటితో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.భరత్ కమ్మా దర్శకత్వం ఓ సినిమా చేస్తున్నాడు.
కాకినాడలోని ఒక కాలేజ్ స్టూడెంట్ గా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ చేస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే జరగనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని ‘తొండంగి’లో షూటింగు జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.