Saturday, April 27, 2024
- Advertisement -

రెండో భార్యను చంపిన కేసులో మొదటి భార్య హత్య ట్విస్ట్!

- Advertisement -

పెద్దలు కుదిర్చిన వివాహ బంధాన్ని ఈ మద్య కొంత మంది చిన్న చూపు చూస్తున్నారు. తమ సుఖం కోసం భర్తను భార్య.. భార్యను భర్త హత్యలు చేయించే స్థాయికి వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా రెండో భార్యను చంపిన కేసులో విచారిస్తుండగా మొదటి భార్యను తానే చంపానని పోలీసులు ఎదుట సైకో భర్త ఒప్పుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో జరిగింది. కర్నె కిరణ్ మానసిక స్థితి సరిగా లేవపోవడంతో తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయలేదు. కానీ రైల్వే స్టేషన్ లో ఒంటరిగా జీవితం గడుపుతున్న ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.

కానీ పెళ్లైన తర్వాత ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మాత్రమే కాదు ఒకరోజు దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ విషయం బయటకు తెలియకుండా మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. తర్వాత నర్సుగా పని చేసే అంజలీబాయి అనే మహిళను కిరణ్ రెండో వివాహం చేసుకున్నాడు. రెండేళ్లు ఆమెతో బాగానే కాపురం చేశాడు.. ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు వచ్చిన తరువాత ఇల్లు అమ్మి డబ్బు తీసుకరావాలని భార్యను వేధించాడు. అంతే కాదు ఆమెపై దారుణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ నేపథ్యంలో పోలీసులు కిరణ్ ని తమదైన పద్దతిలో ప్రశ్నించగా మొదటి భార్యని చంపిన విషయం కూడా బయట పెట్టాడు. ఆమె అనాధ కావడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిసింది. గతంలో సైకోగా వ్యవహరించిన కిరణ్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రికి అప్పటి ఎస్‌ఐ రమేష్ నాయక్ తరలించాడు. ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి కిరణ్ తప్పించుకున్నాడు. అంజలీబాయి తల్లి ఓడపల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎసిపి నరేష్ కుమార్ తెలిపారు.

పవన్ ‘ హరి హర వీరమల్లు’ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ!

నేటి పంచాంగం, ఆదివారం (16-05-2021)

బీ అలర్ట్.. ముంచుకొస్తున్న ‘తౌతే ‘ తుఫాను…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -