Monday, April 29, 2024
- Advertisement -

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి..!

- Advertisement -

ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. భద్రతా చర్యలు పాటించాలని వాహనదారులకు చెబుతున్నా… కొంత మంది నిర్లక్ష్యం ఎన్నో నిండు ప్రాణాలు బలికొంటున్నాయి. వేల మంది అంగవైకల్యంతో విల విలలాడుతున్నారు.. మరెంతో మంది అనాధలుగా మిగులుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతిచెందారు.

నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ టెంపో ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, మహిళలు ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

స్థానికుల సహయంతో క్షతగాత్రులను  ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా తమిళనాడులోని చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. శ్రీశైలం నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. టెంపో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు.

చిరు పొగడ్తలు.. సొట్ట బుగ్గల పిల్లకు హీరోయిన్‌ చాన్స్‌

ఏపీ లో కొత్త రూల్స్.. మంత్రి ఆదేశాలు జారీ..!

బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -