ఏపిలో సంచలనంరేపిన వీరవాసరం పోలీస్ స్టేషన్ డబ్బు మాయం కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో స్టేషన్లో పనిచేసే సిబ్బందిని నిందితులుగా తేల్చారు. వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన డబ్బును సోమవారం పోలీస్ స్టేషన్లో రూ.8 లక్షలను పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు.
బ్యాంకులు తెరిచిన తర్వాత పోలీస్స్టేషన్లో భద్రపరచిన డబ్బు కోసం వైన్ షాపుల సిబ్బంది వెళ్లగా..లాకర్లో ఉంచిన నగదు కనిపించలేదు.లాకప్లో ఉంచిన ట్రంకు పెట్టి సీల్ తొలగించి తాళం పగులకొట్టి నగదు దొంగిలించినట్లు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చోరీకి గురైన నగదులో వీరవాసరం మద్యం దుకాణానికి సంబంధించి రూ.1,50,000, నౌడూరు దుకాణం- రూ.2,16,060, కొణితివాడ దుకాణం- రూ.50,000, రాయకుదురు దుకాణానికి చెందిన రూ.3,88,270 ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
దీంతో ఈ కేసు సీరియస్ గా తీసుకొని ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్లో డబ్బు మాయమైన ఘటనపై విచారణ చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ద్వారా వీరిద్దరి గుట్టు బయటపడింది. ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.8,04,330 స్వాధీనం చేసుకున్నారు.
వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !