Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీ ఎన్నికలు…అప్పుడే బెట్టింగ్‌ల జోరూ!

- Advertisement -

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వైసీపీ , టీడీపీ నేతలు ఎన్నికల క్షేత్రంలో హీట్ పెంచేయగా ఇక అప్పుడే బెట్టింగ్‌ల జోరు నడుస్తోంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది, మెజారిటీ ఎంత అన్న దానిపై పందెం రాయుళ్లు భారీగా బెట్టింగ్ కాస్తున్నారు.

ప్రధానంగా దెందలూరు అంటే గుర్తుకొచ్చేది చింతమనేని ప్రభాకర్. తన మాటతీరుతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు. గత ఎన్నికల్లో చింతమనేనిపై వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి 17 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక దెందలూరు తనకు కంచుకోటలా మార్చుకున్నారు చింతమనేని. ప్రధానంగా రౌడయిజమే ఆయుధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అందుకే రెండుసార్లు ఇక్కడి నుండి విజయం సాధించిన చింతమనేనిని ఓడించి ప్రజలు అబ్బయ్య చౌదరి వెంట నిలబడ్డారు.

ఇప్పుడు ఈ స్థానమే బెట్టింగ్ రాయుళ్లకు కీలకంగా మారింది. ఇక్కడ టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, గెలిస్తే ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారు అన్నదానిపై పెద్ద ఎత్తున పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లలో బెట్టింగ్ కాసేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే వైసీపీ గెలుస్తుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా ఈ నియోజకవర్గంలో మండలాల వారిగా బెట్టింగ్ నడుస్తుండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -