టీడీపీ – జనసేన మధ్య సీట్ల పొత్తు అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 25 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఓకే చెప్పగా దీనిపై ఫిబ్రవరి 8న అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అంతా సర్దుకుంటుందని అనుకునేలోపే బాంబు పేల్చారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. పొత్తులో భాగంగా సీటు తనకే వస్తుందని తెలిపారు.జనసేనకు రాజమండ్రి అర్బన్ సీటు కేటాయిస్తారనే దాంట్లో నిజం లేదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు కాకుండా వేరేవారికి సీటు ఇస్తారడం హాస్యాస్పదం అన్నారు.
సీటు తనకే వస్తుందని పవన్ ఎంత ఒత్తిడి తెచ్చినా తాను పోటీ చేయడం ఖాయమన్నారు. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని చెప్పుకొచ్చారు. ఆదివారం టీడీపీ – జనసేన పొత్తులో సీట్లను ఖరారు చేసేందుకు రెండు సార్లు భేటీ అయ్యారు పవన్ – చంద్రబాబు. దాదాపు సీట్ల పొత్తు అంశం ఖరారు కాగా 8న ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.