ఒంగోలు రాజకీయాలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే జగన్తో సమావేశం తర్వాత బాలినేని మెత్తబడ్డారు.
ఒంగోలు ఎంపీగా ఎవరు వచ్చినా ఒకేనని…ఈ విషయంలో జగన్ నిర్ణయమే శిరోధార్యం అని తేల్చి చెప్పేశారు. దీంతో ఒంగోలు సీటు విషయంపై కొంతకాలంగా సాగుతున్న వార్కు తెరపడింది. ఒంగోలు ఎంపీగా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోసం ప్రయత్నం చేశానని కానీ ఈ విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.
అందరి శ్రేయస్సు కోసం ఒంగోలు సీటుకు మాగుంటను రెఫర్ చేశానని…కానీ ఒంగోలు ఎంపీ సెగ్మంట్ పరిధిలో ఇంఛార్జీలు ముందుకు రాకపోవడంతో వెనక్కితగ్గానని తెలిపారు. మిగితా వాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు, నా ఒంగోలు నియోజకవర్గ పేదల పట్టాలకోసం ప్రయత్నం చేశానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు.