Sunday, May 5, 2024
- Advertisement -

టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే..పవన్‌కు షాక్!

- Advertisement -

టీడీపీ – జనసేనలో టికెట్ల పంచాయితీ ఆగడం లేదు. టికెట్లు ఆశీంచి భంగపడ్డ ఇరు పార్టీల నేతలు చంద్రబాబు, పవన్‌లతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే పవన్ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా తాజాగా ఓ జనసేన నాయకుడు టికెట్ ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశాడు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇంఛార్జీగా ఉన్నారు విడివాడ రామచంద్రారావు. టికెట్ తనకే వస్తుందని ఆశీంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి దక్కింది. కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేరును ప్రకటించారు.

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రామచంద్రరావు తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ బసచేసిన జయా గార్డెన్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళనకు చేపట్టారు రామచంద్రరావు. తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని… లేదంటే ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇక ఈ ఆందోళనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నేతలు రామచంద్రావుతో చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. టికెట్ తనకు దక్కకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -