మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అక్రమాలపై కొరడా ఝుళిపించిన సర్కార్ ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలపై దృష్టి సారించింది. వాస్తవానికి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు అనేకం వచ్చిన వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే తాజాగా కాంగ్రెస్ సర్కార్ రావడంతో మల్లారెడ్డి అక్రమాలను వెలుగు తీసే పనిలో పడింది.
మల్లారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని అందిన ఫిర్యాదు మేరకు శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై 420 సెక్షన్ తో పాటు పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమి ఉంది. దీనిని మల్లారెడ్డి కబ్జా చేశారని కేతావత్ భిక్షపతి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదుచేశారు పోలీసులు.