టాలీవుడ్లో హీరో ఉదయ్ కిరణ్ మరణం ఎంత పెద్ద విషాదం నింపిందో అందరికి తెలిసిందే. చాలా తక్కువ టైంలోనే వరస హిట్స్ అందుకున్న ఈ హీరో.. చిన్న వయసులోనే ఆత్యహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. అయితే దీనికి ఆర్దిక కారణాలే అని ఎక్కువ వార్తలు వినిపిచాయి.
వరస హిట్స్ అందుకుని.. హ్యాపీగా ఉంటూ.. చేతినిండ డబ్బులు సంపాధించుకున్న ఈ హీరోకి కొద్ది కాలం తర్వాత అవకాశాలు లేక అర్ధికంగా చితికి పోవడం వలనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. వాస్తవంగా కూడా అప్పటికే ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆయన తెలుగులో ఛాన్సులు రాకపోవడంతో ఇతర భాషల్లో అడపా దడపా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఈ విషయాలను ఖండించారు. డబ్బులు లేక ఉదయ్ సూసైడ్ చేసుకున్నాడు అనేది నిజం కాదు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ కి అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి అన్నారు.
ఉదయ్ కిరణ్ దగ్గర కోట్ల విలువైన ఆస్తులు, బంగారం ఉన్నాయి అన్నారు. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆ బంగారం, ఆస్తులు ఉదయ్ భార్య విషిత తీసుకున్నారు అని శ్రీదేవి చెప్పారు. అలానే ఆమెను ఎప్పుడు కలుద్దాం అనుకున్న ఏవో సాకులు చెబుతూ తిరిగుతుందని ఆరోపణలు చేశారు. పరోక్షంగా ఉదయ్ కిరణ్ ఆత్మ హత్యకు కారణం భార్య విషిక అని చెప్పారు. ఇక 2000 లో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాధించుకున్నారు. ఆయన 2014లో తన నివాసంలో సూసైడ్ చేసుకున్నారు.