బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్ఉతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.దాదాపు 150 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి సంచనాలుగా మారింది ఈ చిత్రం.బాహుబలి సినిమాతో ఉత్తరిదిలో ప్రభాస్కు భారీ మార్కెట్ ఏర్పడింది. అందుకే దర్శకుడు రెండవ చిత్రానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రికార్డుల వేట మొదలు పెట్టింది. సాహో సినిమా హక్కుల కోసం బాలీవుడ్ లో గట్టి పోటి నెలకొంది. సాహో హిందీ శాటిలైట్ హక్కులు 120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది.బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్లు స్వరాలందించటం కూడా బాలీవుడ్ మార్కెట్కు కలిసొస్తుందని భావిస్తున్నారు.దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పందన రాలేదు.హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా బాలీవుడ్ మార్కెట్కు బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తుంది.