Saturday, April 27, 2024
- Advertisement -

మళ్లీ మెసేజ్ లు మొదలెట్టిన మహేష్ బాబు

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబుకు మెసేజ్ లు అంతగా వర్కవుట్ కావు.ఆల్రెడీ ఈ విషయంలో మనోడు చాలా నేర్చుకున్నాడు.

అయితే కొరటాల మీద నమ్మకంతో మెసేజ్ ల జోలికి పోయి….ఎవ్వరూ ఊహించని విధంగా….మాంచి హిట్ ను కొట్టాడు.అదే ఊపు మీద ఇపుడు వెంటనే మరో మెసేజ్ అందిస్తానంటున్నాడు. 

తాజాగా శ్రీమంతుడు తర్వాత మనోడు మురుగదాస్ తో కలిసి చేస్తోన్న చిత్రం కూడా మెసేజ్ ఓరియెంటెడే అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.శ్రీమంతుడుతో కలిసొచ్చిన సెంటిమెంట్ ఆ తరువాత కూడా కలిసొచ్చేలా మురుగదాస్ తో ప్లాన్ చేసాడని చెబుతున్నారు. మురుగదాస్ చేసే చిత్రాలు ఏతరహాలో ఉంటాయో ప్రత్యేకించి చెపుకోవల్సిన అవసరం లేదు.

గజిని, స్టాలిన్, తుపాకి, కత్తి, రమణ సినిమాలు….  దర్శకుడిగా మురుగదాస్ స్టామినాను చూపిస్తాయి.ఇలా చేసిన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక బలమైన అంశాన్ని మురుగదాస్ చెప్పాడు.

గతంలో చెప్పినట్లే….ఈసారి కూడా  మహేష్‌ సోషల్ మెసేజ్ ఉన్న కథనే రూపొందించాడని  తెలుస్తోంది. ఠాగూర్ తమిళ మాతృక రమణలో లంచగొండితనం, ‘స్టాలిన్‌’లో ఇతరులకు సాయపడాలన్న ఆలోచన, ‘తుపాకి’లో ఓ జవాను నేపథ్యం, ‘కత్తి’లో రైతుల పోరాటం.. ఇలా బలమైన సామాజిక అంశాలను స్పృశిస్తూ వెళుతోన్న మురుగదాస్, మహేష్ కోసం రాసిన కథలో న్యాయ వ్యవస్థలోని కొన్ని లోటుపాట్లను ప్రస్తావించనున్నాడని తెలుస్తోంది. 

ఒక వేల అదే గనుక జరిగితే…మహేష్ చేసే ఆ సినిమా పబ్లిక్ మీద శ్రీమంతుడు తరహాలో మరింతగా పడే అవకాశముంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -