తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలని నిర్మించిన ఘనత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ సొంతం. టాలీవుడ్లో కూడా ప్రస్తుత జనరేషన్ స్టార్ హీరోలు అయిన మహేష్బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలను ఆయన తన బ్యానర్ ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్కు సైతం తన రెండో చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్తో సూపర్ హిట్ ఇచ్చారు.
కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు అశ్వనీదత్. ఆయన ఇప్పుడు మళ్లీ మహేష్బాబు కేరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతోన్న 25వ సినిమాను టాలీవుడ్లో మరో టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజుతో కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రాంచరణ్తో పాటు మెగా అభిమానులకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు.
గతంలో చిరుతో ఆయన జగదేకవీరుడు – అతిలోకసుందరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీశారు. ఈ సీక్వెల్లో రాంచరణ్ హీరోగా నటిస్తాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్లోను చెర్రీ- శ్రీదేవి కూతురుతో చేస్తారా అని అడిగితే ఆ సినిమాను తాను వారిద్దరితో చేయాలని అనుకోవడం లేదు…అయినా ఆ సీక్వెల్ కోసం రెండు,మూడు కథలను అనుకున్నాము కాని అవేమి కుదరలేదు…. ఆ కథ కు ఎవరు కరెక్ట్ అయితే వారితోనే తీస్తానని ఆయన చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే జగదేకవీరుడు సీక్వెల్లో చరణ్ నటిస్తాడని గ్యారెంటీ లేనట్లయ్యింది. ఈ సీక్వెల్ లో చరణ్ నటిస్తాడు అని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి అశ్వనీదత్ షాక్ ఇచ్చారు.
Related