బోయపాటి శ్రీను, నందమూరి బాలక్రిష్ట కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వస్లూళ్లను సాధిస్తోంది. చాలాకాలం తర్వాత అఖండ విజయంతో తెలుగు సినీ పరిశ్రమకు మంచి ఊపు లభించినట్టయింది. దీంతో మంచి జోరు మీదున్నారు బలయ్య. ఇదే ఊపులో పలు సినిమాలకు ఓకే చెప్పారు.
అంతేకాదు తన రెమ్మునరేషన్ కు కూడా భారీ స్థాయిలో పెంచారట. గతంలో ఒక సినిమాకు రూ.10 కోట్లు తీసుకున్న బాలయ్య అఖండ హిట్ తో తన రేటును పెంచారని టాలీవుడ్ లో టాక్. ప్రస్తుతం రూ. 15 కోట్ల నుంచి రూ.20 కోట్లు తీసుకుంటున్నారట. ఇప్పటికే బాలయ్యతో సినిమాలకు కమిటైన ప్రొడ్యూసర్లు ఆందోళనలో పడ్డారని టాక్.
ఏది ఏమైనా బాలయ్య క్రేజ్ ను క్యాస్ చేసుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నారు. రేటు పెంచినా సరే సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. తగ్గేదే లేదు అని అంటున్నారు. అందుకే బాలయ్యతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాలక్రిష్ట హీరోగా గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లతోనూ సినిమాలకు పచ్చ జెండా ఊపారు బాలయ్య.