సెకండ్ ఇన్నింగ్స్లో పవన్ కల్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. అటు తన పార్టీ పనులు చూసుకుంటూనే ఇటు సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేస్తూ ఫుల్ జోష్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్.. ప్రస్తుతం మలయాళంలోని సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’సినిమా తెలుగులో రీమేక్ షూటింగ్లో బిజీ అయ్యాడు.
మల్లూవుడ్లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్ సినిమాలున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా కూడా ఒప్పకున్నాడట పవన్ కల్యాణ్. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘ఖిలాడీ’ మూవీ రూపొందిస్తున్న రమేష్ వర్మతో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇటీవలే పవన్కి ఓ స్టోరీ లైన్ వినిపించాడట రమేష్ వర్మ. ఈ లైన్ పవన్కి నచ్చడంతో కథను డెవలప్ చేయాల్సిందిగా సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రమేష్ వర్మ టాలీవుడ్ మాస్ మాహారాజా రవితేజతో కలిసి ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యక పవన్ సినిమాను ప్రారంభించినున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కెరీర్లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!