ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకెళ్తోంది జబర్దస్త్ షో. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. చాలా మంది సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే ఈ షో ఎంత ఫేమస్ అయినప్పటికి.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుకుంటూనే ఉంటుంది.
అయితే ఈ షో కరోనా లాక్ డౌన్ తర్వాత మొదలైంది. ఇప్పుడు ఈ జబర్దస్త్ షోలో వివాదం మొదలైంది. తాజాగా స్కిట్ లో భాగంగా కమెడియన్ ముక్కు అవినాష్ .. ఏపీలో మద్యం ధరలు బాగా పెరిగాయని.. లాక్ డౌన్ వేళ ఒక ఫుల్ బాటిల్ ను 9 వేలకు కొన్నానని పంచ్ వేశాడు. అయితే వెంటనే జడ్జిగా ఉన్న రోజా తేరుకొని మధ్యలోనే అవినాష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
స్టేజ్ పైన కౌంటర్ ఇస్తూ.. ‘ఎవడు కొనమన్నాడురా నిన్ను అంత రేట్ పెట్టి.. తాగుబోతు సచ్చినోడా’ అంటూ పంచ్ వేసింది. ఆ రోజు షో తర్వాత కూడా అవినాష్ కు కాస్త క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వాలు విధానాలపై పంచ్ లు వేసే ముందు కొంచెం ఆలోచించి స్కిట్ చేయాలని అవినాష్ తోపాటు మిగతా వారికి కూడా రోజా హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఇంట్లో.. అందాల ముద్దుగుమ్మలు వీరే..!
వర్మ తీసిన ’నగ్నం’ లో నటించిన అమ్మాయి ఎవరంటే ?
సుధీర్ అన్ని నాలుగు గోడల్ మధ్యలోనే చేస్తాడు.. సుధీర్ కి ప్రదీప్ పంచ్..!