Sunday, May 19, 2024
- Advertisement -

జూ ఎన్టీఆర్ పై పగపట్టింది వాళ్లే.. : రోజా కామెంట్స్

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజా.. నోరు విప్పితే.. ఏదో ఒక వివాదం జరగాల్సిందే. ఎక్కువ టీడీపీనే విమర్శించే ఆమె.. మైకు దొరికినప్పుడల్లా ఆ పార్టీని తన మాటలతూటాలతో ఉతికారేస్తుంటారు. గతంలో ఆ పార్టీలో కొన్నాళ్లు ఉండి వచ్చిన ఆమె.. తనకు తెలిసిన బాగోతల్ని ఒక్కొక్కటిగా విప్పుతూ సరికొత్త సంచలనాలకు తావిస్తుంటుంది.

తాజాగా మరో విషయంపై ఆమె చేసిన కామెంట్స్.. ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో భాగంగా టీడీపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తూ.. నటరుద్ర ఎన్టీఆర్ గురించి మాట్లాడింది. తన పార్టీ పార్టీ బలహీనంగా వుందని గుర్తించిన ప్రతిసారి ఎన్టీఆర్‌ని ఏపీ సిఎం చంద్రబాబు అడ్డదిడ్డంగా వాడేస్తున్నారని, 2009 ఎన్నికల సమయంలోనూ అదే జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఆ ఎన్నికల సమయంలో.. తన పార్టీకి మద్దతుగా ఎన్టీఆర్ తో విస్తృతంగా ప్రచారం చేయించుకుని, ఆ తర్వాత వదిలేశారని ఆమె తెలిపింది.

అంతేకాకుండా.. తారక్ ఎదుగుదలను చూసి ఓర్వలేక అతని సినిమాలు ఆడనివ్వకుండా బాబు అతని టీం కుట్రలు చేసిందని ఎమ్మెల్యే రోజా తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఇలా రోజా చేసిన కామెంట్స్ రెండూ రాష్ట్రాల్లో దుమారం రేపాయి. మరి నిజంగానే ఎన్టీఆర్ కి టీడీపీతో విభేదాలు ఉన్నాయో.. లేదో తెలియదు కానీ ఆమె చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీనిపై టీడీపీ లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -