Tuesday, April 23, 2024
- Advertisement -

ఇక్కడ పండుగ.. అక్కడ మంచుతో చావులు..!

- Advertisement -

జపాన్​ తీర ప్రాంతాల్లో తీవ్ర హిమపాతం కారణంగా ఇప్పటివరకు 13మంది మృతి చెందారు. సుమారు 250 మంది గాయపడ్డారు. ఈ మేరకు వెల్లడించిన విపత్తు నిర్వహణ విభాగం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

ఫుకుయ్ జిల్లాలో 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల ముగ్గురు వృద్ధులు మృతిచెందారని తెలిపింది. మరో 47 మంది హిమపాతానికి సంబంధించి జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డారని పేర్కొంది. నీగటా జిల్లాలో మంచును తొలగించే క్రమంలో నలుగురు మృతి చెందారని తెలిపింది.

మంచు తుపాను ధాటికి జపాన్​లోని వివిధ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఫుకుయ్ జిల్లాలోని రహదారిపై 1200 వాహనాలు నిలిచిపోయాయి. టొయోమా, నీగటా జిల్లాల్లోనూ ఇటువంటి పరిస్థితే నెలకొంది.

56.5లక్షల టీకా డోసులు.. వెల్లడించిన హర్​దీప్​ సింగ్​ పూరీ..!

ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం..!

యువకులపై.. చంద్రన్న కన్నీటి ధారా వాహిని..!

క్యూబాపై ట్రంప్‌ సర్కారు ఉగ్రవాద ముద్ర..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -