- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కేసులు మళ్ళీపెరుగుతున్నాయి. నిన్నటి రోజున 700 లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏపిలోని తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్నాడు.
అస్వస్థతకు గురి అయిన విద్యార్థి కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దాంతో ఆ కుటుంబ సభ్యులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,984కు చేరింది. ఇదులో 8,82,314 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3469 మంది చికిత్స పొందుతుండగా, 7201 మంది మరణించారు.