భారతీయ టెలికం రంగాన్ని మార్చేసిన జియే….మరో సంచలనానికి తెరతీసింది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సేవలతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో తాజాగా ఫీచర్ ఫోన్ల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అతి చవక ధరకే 4జీ ఫోన్ను అందుబాటులోకి తీసుకురానుంది.
దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రూ.1500 ఉంటుందని అంతా భావించినప్పటికీ రూ. 500లకే అందించనుందట. 4జీ వోల్ట్ సపోర్ట్తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ అంచనా ప్రకారం రూ. 500 కే అందించనుంది. ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్ ఫోన్ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
{loadmodule mod_custom,GA1}
2జీ మొబైల్ వినియోగదారులపై కన్నేసిన జియో నేరుగా 4కి మారడానికి ఈ 4జీ ఫీచర్ ఫోన్ పదునైన ఆయుధంగా వాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అద్భుతమైన ఆఫర్, తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}I5kGcgZ-zuA{/youtube}