రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నంద్యాల రాజకీయాలు ఉత్కంటతను రేపుతున్నాయి.రోజుకో మలుపు తిరుగుతూ టీడీపీకి నిద్రలేకుండా పోతోంది.ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు మరో సీనియర్నాయకుడు టీడీపీకి షాక్ ఇవ్వబోతున్నారన్నవార్తలు కలకలం రేపుతున్నాయి.
గత కొద్దిరోజులుగా నంద్యాల రాజకీయాలు ఎలాంటి మలుపులు,ట్విస్ట్లు జరిగాయే అందరికి తెలిసందే. చివరకు శిల్పామోహన్ రెడ్డి, ఆయనతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్, 25 మంది కౌన్సిలర్లు, 16 మంది సర్పంచ్లు భారీగా ఎంపీటీసీలు వెళ్లిపోవడంతో టీడీపీ నాయకత్వం ఆందోళన చెందింది. స్వయంగా బాబే రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు.
{loadmodule mod_custom,GA1}
గందరగోలంగా ఉన్న నంద్యాల రాజకీయాలను చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. అఖిలకు ఫోన్ చేసి ఏకపక్షంగా వెల్లవద్దని …అందరిని కలుపుకొని పోవాలని సూచించారు. అయితే ఇంతలోనే నంద్యాల టీడీపీలో మరో ట్విస్ట్ హల్చల్ చేస్తోంది. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, నంద్యాల, ఆళ్లగడ్డలో భూమా తరపున తెరవెనుక చక్రం తిప్పిన ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు. శుక్రవారం ఉదయం తన అనుచరులతో ఏవీ సుబ్బారెడ్డి రహస్య సమావేశం నిర్వహించారు.
నాగిరెడ్డి మరణం తర్వాత భూమా అఖిలప్రియ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తనను అవమానిస్తున్నారని, ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని పూర్తిగా పక్కన పెట్టేశారని అనుచరులతో ఆవేదన చెందారు. అందుకే తాను గట్టి నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. తనతో ఉంటారో లేక భూమా అఖిలప్రియతో కలిసి నడుస్తారో నిర్ణయించుకోవాలని కార్యకర్తలకు, అనుచరులకు ఏవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు.
{loadmodule mod_custom,GA2}
అయితే ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు గురించి తెలుసుకున్న సుజనా చౌదరి, కాల్వ శ్రీనివాస్ వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. తొందరపడవద్దని కోరారు. విజయవాడ వచ్చి సీఎంను కలవాల్సిందిగా కోరారు. అయితే ఆయన మాత్రం భూమా అఖిలప్రియతో కలిసి పనిచేసేందుకు ఏమాత్రం సుముఖంగా లేరని చెబుతున్నారు. పార్టీ మారితే టీడీపీతోపాటు అఖిలప్రియ కూడా చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- శిల్పా …అఖిల మద్య మాటల యుద్ధం….
- బాబు నంద్యాల ఉప ఎన్నిక టికెట్టు సర్వేలో ఆసక్తికర ఫలితాలు
- భవిష్యత్తులో అఖిలప్రియ ఒంటరేనా…!
- మా ఇలాకాలో మీపెత్తనమేంటి – భూమా అఖిలప్రియ
{youtube}E3VTxtbzSjY{/youtube}