- Advertisement -
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి కనకదుర్గ (63) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆంధ్రజ్యోతి ఓ సంస్థగా ఆర్థికంగా బలంగా ఎదగడంతో ఆమె కీలక పాత్ర పోషించారు.
డైరెక్టర్గా సంస్థకు మార్గదర్శనం చేశారు. వేమూరి కనకదుర్గ భౌతికకాయానికి ఈ మధ్యాహ్నం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ ప్రముఖులు వేమూరి రాధాకృష్ణకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ తీరు ఇలా…!