Saturday, April 27, 2024
- Advertisement -

అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు కన్నుమూత!

- Advertisement -

అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు (56) గుండెపోటుతో మృతి చెందారు. గుండె పోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పట్లో ఆకర్షణీయమైన వడ్డీలు చెల్లిస్తామంటూ 8 రాష్ట్రాలకు చెందిన దాదాపు 32 లక్షల మంది నుంచి రూ. 6.5 వేల కోట్ల డిపాజిట్ సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ వారందరినీ ముంచింది.

నివాస స్థలాలు, వ్యవసాయ భూములు, పెట్టుబడులకు ఆకర్షణీయమైన వడ్డీలు చెల్లిస్తామని డిపాజిట్లు సేకరించి అగ్రిగోల్డ్‌ యాజమాన్యం నిధులు దారి మళ్లించినట్లు కేసులు నమోదు అయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు ఇంకా తేలలేదు. ఈ కేసు రాజకీయ కోణంలో కూడా పలు ప్రకంపణలు సృష్టించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు (56) నిన్న గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే ఉదయభాస్కరరావు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.  అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసులో ఆ సంస్థ డైరెక్టర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత వారు బెయిలుపై బయటకు వచ్చారు. 

మహిళలకు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధర!

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -