అరుదైన వస్తువులను… రుణం ఎగ్గొట్టిన వారి ఇళ్లను.. కంపెనీలను ఇలా వేలంలో అమ్మడం తరచూ చూస్తుంటాం.వాటితోపాటు బ్యాంకుల్లో ఉన్న బంగారు రునాలు కట్టలేనపుడు ఆ వస్తువులను వేలంపాట నిర్వహించడం సాధారనం.
వేలంలో ఎవరు ఎక్కువ డబ్బులకు ఎవరు వేలం పాడితే వారికే ఆ వస్తువుని అమ్ముతారు.కానీ స్పెయిన్ లో భార్యా,భర్తలు 31 ఏళ్లుగా సంరక్షిస్తున్న తమ గ్రామాన్నే వేలంలో పెట్టారు.
స్పెయిన్లోని అలాదిన్ గ్రామంలో కేవలం 15మంది నివసిస్తారు. వారంతా కలిసి మొబైల్ హోం.. పార్క్.. కేఫ్.. హోటల్.. బార్.. రెండంతస్తుల సూపర్మార్కెట్లను నిర్వహిస్తుంటారు.ఈ గ్రామానికి యజమానులైన రిక్.. జుడీ బ్రెంగల్ దంపతులు 31ఏళ్లుగా ఈ గ్రామాన్ని కంటికి రెప్పలా సంరక్షించారు.యసు మీద పడటంతో గ్రామ నిర్వహణ వారికి భారంగా మారింది. దీంతో గ్రామాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు.
{loadmodule mod_custom,GA2}
ఈ గ్రామాన్ని వేలంలో అమ్మేందుకు ఓ వెబ్సైట్లో వివరాలను ఉంచారు.మొత్తం ఒక్కరే గానీ.. వేర్వేరు వ్యక్తులు గ్రామంలోని దుకాణాలను వేలంలో కొనుక్కోవచ్చు. ప్రస్తుతం సూపర్మార్కెట్గా ఉన్న 127 ఏళ్ల క్రితం నాటి రెండంతస్తుల భవనాన్నే ఈ వేలంలో రూ.9.7కోట్లకు మొదటగా అడుగుతున్నారు.
గతంలో ఒక సారి ఇదే గ్రామాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టినా ఎవరూ కొనడానికి ఆసక్తి చూపలేదు.మల్లీ ఇప్పుడు మరో సారి ఆగ్రామాన్ని వేలానికి పెట్టారు.ఎవరైనా ఆసక్తి ఉంటె వెంటనే గ్రామాన్ని కొనేయండి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}-HL6gZafHP4{/youtube}