- Advertisement -
బ్యాంకుల నుండి డబ్బులు విత్ డ్రా చేయాలనుకునే ఖాతాదారులకు బ్యాంకులు పెద్ద షాక్ ఇస్తున్నాయి. విత్ డ్రా చేస్తే… ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ప్రతి వెయ్యి రూపాయల మీద 5రూపాయలు వసూలు చేయనున్నాయి. బ్యాంకు అకౌంట్ నుండి నగదు విత్ డ్రా చేసినా, డిపాజిట్ చేసినా..నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చు.
ఆపై అదనంగా జరిగే లావాదేవీలకు ఖచ్చితంగా ఛార్జీలు చెల్లించాల్సిందే. ఈ విధానాన్ని HDFC , ICICI బ్యాంకులు నిన్నటి నుండే అమలులోకి తీసుకు రాగా మరికొన్ని రోజుల్లో అన్ని బ్యాంకులు చార్జీల మోత మోగించబోతున్నాయి. దీంతో ఖాతాదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి.
{youtube}-XQO-9WPeSo{/youtube}