- Advertisement -
పోలింగ్ పూర్తయిన వెంటనె ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు సిద్దం అయ్యింది. ఏపీఎస్ ఆర్టీలో చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. నిర్వహణా వ్యయం, బస్సుల మరమ్మతు వ్యయాలతో పాటు ఉద్యోగుల వేతనాల మొత్తం పెరగడంతో, నష్టాన్ని నివారించేందుకు బస్సు చార్జీలను పెంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు. దీనకి సంబంధించి 15 నుంచి 17 శాతం వరకూ పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ప్రభుత్వానికి పంపారు. ఏసీ సర్వీసుల్లో 17 శాతం వరకూ, నాన్ ఏసీ సర్వీసుల్లో 15 శాతం వరకూ టికెట్ ధరలను పెంచేందుకు అనుమతించాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున్న కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ధరల పెంపుపై నిర్ణయం వెలువడ వచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు.