Friday, May 17, 2024
- Advertisement -

వైసీపీనుంచి అఫ‌ర్ ఉంద‌ని ప్ర‌క‌టించిన ఏవి సుబ్బారెడ్డి…

- Advertisement -
Bhuma Follower likely to Join YSRCP

నంద్యాల రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి.అధికార టీడీపీకి షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి.దీంతో అధినాయ‌క‌త్వం విల‌విల్లాడుతోంది. ఇప్ప‌టికే నంద్యాల నుంచి శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో కోలుకోలేని దెబ్బ‌త‌గిలిన బాబుకు ఇప్పుడు కోలుకోలేని మ‌రో దెబ్బ ప‌డింది.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపిలో సంక్షోభం కొనసాగుతోంది. దివంగ‌త భూమా నాగిరెడ్డికి కుడిబుజంగా ఉన్న సీనియ‌ర్‌నేత ఏవి సుబ్బారెడ్డి వైసీపీలోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.దీంతో టీడీపీ ఉలిక్కిప‌డింది.తనకు వైసీపీ నుండి కూడ ఆఫర్ ఉందని ప్రకటించారు. ఉప ఎన్నికల వరకే తాను టిడిపి కోసం పనిచేస్తానని చెప్పారు.

{loadmodule mod_custom,GA1}

నంద్యాల‌లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో న‌ష్ట‌నివార‌న చ‌ర్య‌ల‌కు పూనుకుంది టీడీపీ.నంద్యాలలో టిడిపి కౌన్సిలర్లతో సమావేశమైన ఏవీ సుబ్బారెడ్డిని కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు ఆయనకు ఫోన్ చేశారు. అయితే ఈ ఫోన్లతో ఏవీసుబ్బారెడ్డి హైద్రాబాద్ లో కేంద్రమంత్రి సుజనా చౌదరితో చర్చించారు.
ఉప ఎన్నికల తర్వాత ఏం జరుగుతోందోనని తనకు తెలియదన్నారు. వైసీపీ నుండి కూడ తనకు ఆఫర్ ఉందన్నారు. నంద్యాలలో భూమావర్గాన్ని తానే తయారు చేసినట్టుగా ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. అయితే తననకు మంత్రి అఖిలప్రియ ఎందుకు పక్కన పెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. భూమానాగిరెడ్డి తనకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం 25 శాతం కూడ అఖిలప్రియ ఇవ్వడం లేదన్నారు. అసలు తనను పక్కనపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

{loadmodule mod_custom,GA2}

ఇప్ప‌టికే దెబ్బ‌మీద‌దెబ్బ‌ల‌తో కుదేల‌వుతున్న టీడీపీకి ఏవి సుబ్బారెడ్డి పెద్ద షాకే ఇచ్చార‌నుకోవాలి.న‌ష్ట‌నివార‌ను బాబు పూనుకున్నారు.క‌ర్నూలు నేత‌లంగా అమ‌రావ‌తికి రావాల‌ని ఆదేశించారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}E3VTxtbzSjY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -