- Advertisement -
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లాంచ్ ప్యాడ్ల వద్ద 400మంది ముష్కరులు భారత్లోకి ఎప్పుడు చొరబడుదామా అని ఎదురుచూస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిన్నట్లు పేర్కొన్నాయి.
అయితే భద్రతా దళాల పటిష్ఠ నిఘా, చొరబాటు వ్యతిరేక చర్యల కారణంగా పాకిస్థాన్ ఉసిగొల్పుతున్న ముష్కరులు భారత్లోకి ప్రవేశించలేకపోతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.2020లో జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి 44 చొరబాటు ఘటనలు జరిగాయి. 2019లో ఆ సంఖ్య 141గా ఉంది. 2018లో 143 మంది ముష్కరులు కశ్మీర్లోకి అక్రమంగా ప్రవేశించారు.
జర్మనీ ఛాన్సలర్కి మోదీ కరోనా పాఠాలు..!
మీరు మళ్ళీ ఈవీఎంలో ఓటు వెయ్యగలరా.. ఏమో డౌటే..!