- Advertisement -
అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్టెక్ ఫార్మా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ను ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్థం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని బయోఎన్టెక్ ఫార్మా సంస్థ సీఈఓ ఉగుర్ షాహీన్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 43వేల మందిపై పరీక్షలు నిర్వహించామన్నారు.
ఈ వ్యాక్సిన్ 90శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ నాటికి 30కోట్లకు పైగా టీకా డోసులను సరఫరా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
వైరస్ వ్యాప్తిని ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ కచ్చితంగా నియంత్రిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. టీకా తీసుకున్నవారిలో లక్షణాలు రాకుండా వ్యాక్సిన్ పనిచేస్తుందన్నారు.
100 పురాతన శవపేటికలు@ 2500 సంవత్సరాలు..!
కరోనా డేంజర్ బెల్.. రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు!