- Advertisement -
ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు సతమతం అవుతోంది. ఇలాంటి సమయంలో అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే మహమ్మారిని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో.. వైద్య పరికరాల సరఫరాలో సహకరించుకునేందుకు ఏ దేశం ముందుకు రావట్లేదు. కేవలం ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాల ద్వారానే ఇచ్చిపుచ్చుకునేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 73వ వార్షిక సమావేశంలో కొన్ని కీలక సూచనలు చేశారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.
పాథోజెన్లు, టెస్టింగ్ పరికరాలు వంటి సహాయ సహకారాల కోసం ప్రపంచదేశాలన్ని కలిసి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అథనోమ్ అన్నారు. ఇది అత్యవసర చర్యగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ 73వ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ సూచనలు చేశారు.
గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!