Friday, March 29, 2024
- Advertisement -

ఆ మూడు నియోజకవర్గాలలో ఎన్నికల రద్దు చేయాలి: వర్ల రామయ్య

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​కుమార్‌ను టిడిపి నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు కలిశారు. మాచర్ల, తంబళ్లపల్లి, పుంగనూరులో ఫిర్యాదులపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నామినేషన్ వేయనీయకుండా వైసిపి నేతలు హింసించిన తీరుపై చంద్రబాబు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారన్న నేతలు..

హైకోర్టు తీర్పు ప్రకారం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు.90శాతం గెలవకపోతే పదవులు పోతాయనే భయంతో వైసిపి నేతలు వ్యవహరించారని వర్ల రామయ్య ఆరోపించారు. గతంలో లేనంతగా ఏకగ్రీవాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. తంబళ్లపల్లెలో ఎలా ఏకగ్రీవాలయ్యాయని నిలదీశారు.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికలు రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని కోరామని, ఎస్ఈసీ న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారని వెల్లడించారు.

మదనపల్లెకి మరో చేదు వార్త.. ఒకే కుటుంబంలో 14 మంది మృతి..!

క్యూట్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ టీజర్!

కాజల్ లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్టులు!

పైన..కోళ్ల పెంట.. కింద కిక్కు ఇచ్చే లిక్కర్ చూశారా తెలివి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -