Thursday, April 25, 2024
- Advertisement -

మదనపల్లెకి మరో చేదు వార్త.. ఒకే కుటుంబంలో 14 మంది మృతి..!

- Advertisement -

కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్నలారీని వేగంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు.

ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్‌, ఆస్మా, కాశీం(10), ముస్తాక్‌ (12)ను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్‌ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు.

క్యూట్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ టీజర్!

కాజల్ లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్టులు!

పైన..కోళ్ల పెంట.. కింద కిక్కు ఇచ్చే లిక్కర్ చూశారా తెలివి..!

జావడేకర్ దగ్గిరకి బండి సంజయ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -