- Advertisement -
గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకి సోమవారం ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటారని తెలిపారు.
వాస్తవానికి ఏప్రిల్లోనే ఈ ఆపరేషన్ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. కాని జైట్లీ డయోబెటిస్ సమస్యతో పాటు మరికొన్ని ఇబ్బందులు రావడంతో నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన శనివారం ఎయిమ్స్లో చేరగా… ఉదయం 8 గంటలకు ఆపరేషన్ మొదలు పెట్టారు. ఏప్రిల్ 6న జైట్లీ ఓ ట్వీట్ చేశారు. అందులో తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు… త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.