- Advertisement -
మతం, దేవుడు లేదా దేవతలను చూపిస్తూ టీవీలో ప్రసారమయ్యే ప్రకటనలపై నిషేధం విధించింది బాంబే హైకోర్టు. జస్టిస్ టీవీ నలవాడే, జస్టిస్ ఎమ్జీ శెవాలికర్తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
హనుమాన్ చాలీసా, దేవతల యంత్రాల పేరుతో టీవీల్లో ప్రసారమవుతోన్న ప్రకటనల్ని నిషేధించాలని కోరుతూ రాజేంద్ర గణపతి రావ్ అనే వ్యక్తి ఔరంగాబాద్ ధర్మాసనం వద్ద 2015లో పిటిషన్ దాఖలు చేశారు.
మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు 2013లో బ్లాక్ మేజిక్ చట్టం, అఘోరీ చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక అధికారిని నియమించింది. అయినప్పటికీ ఇలాంటివి పెరిగిపోతున్నాయని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.
రైళ్ల టికెట్లపై రిఫండ్.. మీకు వచ్చిందా..!
జమ్ము కాశ్మీర్ కి కేంద్రమే నియామకాలు..!