ఒక చట్ట సభకు ఎన్నికై, అనర్హత వేటు పడిన సభ్యులు..తిరిగి అదే సభకు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ల అభిప్రాయాలను కోరింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు జయాఠాకుర్ దాఖలు చేసిన పటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ ఎస్. ఎ. బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియణ్ల ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
10వ షెడ్యూలు ప్రకారం అనర్హత వేటు పడపిన చట్టసభ్యులు.. ఖాళీ అయిన తమ స్థానానికి జరిగే ఉప ఎన్నిల్లో పోటీ చేయకుండా నిలువరించాలని పటిషనర్ కోరారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో వారు నామపత్రాలు దాఖలు చేసినా , ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 362(ఎ) ప్రకారం వారి నామినేషన్ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్, మణిపుర్లలో ఇటీవల చేటుచేసుకున్న రాజకీయ పరిణామాలను పిటిషనర్ ప్రస్తావించారు.
టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!
వెన్న లాంటి పాటలు రాసిన వెన్నెలకంటి