హైకోర్ట్ న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర చోటుచేసుకుంది.ఈ దంపతులపై దుండగులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఆ దంపతులు కారులో హైదరాబాద్ నుంచి మంథని వెళ్తున్నప్పుడు ఈ దారుణ హత్య జరిగింది.
తీవ్రంగా గాయపడ్డ ఆ దంపతులను చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయినా కానీ వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ దంపతులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి కారకులైన దుండగులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అందులో భాగంగా చెక్పోస్టుల దగ్గర ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
అయితే ఈ హత్య వెనుకు రాజకీయ నేతలు ఉన్నట్లు వామన్ రావు చనిపోయే ముందు చెప్పినట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వామన్ రావు దంపతులు కొన్ని రోజుల నుంచి వారి స్వస్థలం గుంజపడుగులో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కబ్జాలు, వివాదాస్పద కేసులను బయటకు తీస్తున్నారు. దానికి సంబంధించిన పిల్స్ హైకోర్టులో వేస్తున్నారు. బాధితుల తరుఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
కోయకుండానే ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి !
గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?
నారింజ పండ్లను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
జక్కన్నా.. మజాకా.. విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !