దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తేడాది అక్టోబర్ తర్వాత భారీగా పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. దేశంలో ఒక్కరోజులో ఎక్కువ మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్ 17న 335 మంది మృత్యువాతపడ్డారు.
దేశంలో గత 24 గంటల్లో 81,466 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 469 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,25,039 మంది కోలుకున్నారు. 6,14,696 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,87,89,138 మందికి వ్యాక్సిన్లు వేశారు.
రజినీకాంత్ గొప్పతనానికి నిదర్శనం : సీఎం కేసీఆర్