ఇషా కొప్పికర్ గుర్తుందా… ఒక దశలో బాలీవుడ్ లోని క్రేజియెస్ట్ హీరోయిన్ గా నిలిచి. ‘గర్ల్స్’ వంటి హాట్ సినిమాలో కూడా నటించిన ఈ భామ తెలుగులో కూడా ‘చంద్రలేఖ’ సినిమాలో నటించింది. అయితే ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేకపోయిన ఇషా పెళ్లి చేసుకొని సెటిలయిపోయింది.
ఇటీవలే ఈ చంద్రలేఖ ఒక పాపకు జన్మనిచ్చింది. మరి ఇప్పుడు ఈ భామ తన కూతురితో కలిసి ఆసక్తికరంగా వార్తల్లోకి వచ్చింది.
తాజాగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించింది ఇషా. కూతుళ్లతో కలిసి తీయించుకొన్న సెల్ఫీలను తనకు పంపాలని.. వాటిని తను రీ ట్వీట్ చేస్తానని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా అనేక మంది తమ కూతుళ్లతో సెల్ఫీలు దిగి పీఎం ట్విటర్ ఖాతాకు సెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇషా కూడా ఈ పని చేసింది.
తన కూతురు రియనాతో కలిసి సెల్ఫీదిగి పీఎం ట్విటర్ ఖాతాకు పంపించింది ఈ భామ. ఇలా చేసిన సెలబ్రిటీలు తక్కువమందే కావడంతో.. ఇషా, ఆమె కూతురి ఫోటోకు బాగా గుర్తింపు వచ్చింది. మరి ఇక మిగతా సెలబ్రిటీలు కూడా స్పందించి పీఎం ట్విటర్ ఖాతాతకు తమ కూతుళ్లతో దిగిన సెల్ఫీలను పంపుతారేమో చూడాలి!
{youtube}mY3vDLbKjh4{/youtube}