రాష్ట్రానికి సీఎం ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎన్నికలు జరగాలి… పలితాలు రావాలి…అప్పుడు ఏపార్టీకీ ప్రజలు మెజారిటీ ఇస్తారో వాల్లే సీఎం అవుతారు. కానీ తాజాగా జగణ్ నోటి వెంట సీఎం మాట వచ్చింది. సీఎం అంటే బాబు కాదు జగనే. వచ్చే ఎన్నికల్లో సీఎం పదవి పులివెందులకే సీఎం పదని వరిస్తుందని నేనే సీఎం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పులివేందుల పర్యటనలో జగన్ ఈవ్యాఖ్యలు చేశారు. పులివేందుల నియేజక వర్గంలోకి లింగాల ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్భాను నిర్వహించారు. ఈ ప్రజాదర్భారులో అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలతో విడివిడిగా సమావేశమయ్యారు. ముఖ్యంగా తాగునీటి సమస్యలపై చర్చించారు. అధికారులు తమ సమస్యలపై సత్వరం స్పందించడంలేదనీ జగన్కు చెప్పడంతో అధికారులపై మండి పడ్డారు. తాగునీటి సమస్య ఎక్కడుందో అక్కడ వెంటనే సమస్య పరిస్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజాదర్భారులో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఏఈ పై ఆరోపనలు చేశారు. ఏఈ డబ్బుకోసం పీడిస్తున్నారనీ ఎవరు డబ్బిస్తే వారికి తాగునీటి బిల్లు త్వరగా ఇచ్చేలా చూస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ 2019 ఎన్నికల్లో సీఎం అవుతానని అప్పుడు మీ పై వచ్చిన ఆరోపనలపై విచారన జరిపిస్తాననీ హెచ్చరించారు. సీఎం పదవి ఎవరిని వరిస్తుందో చెప్పలేము.. కానీ జగన్ నేనే సీఎం అవుతానని బలంగా పిక్స్ అయినట్లున్నారు. మరి చూద్దాం ఏంజరుగుతుందో..
Related