Friday, May 17, 2024
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌… ఆరుగురు ఉగ్ర‌వాదులు హ‌తం..

- Advertisement -

జమ్మూ కశ్మీర్‌ లోని అనంతనాగ్‌ సమీపంలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ఆరుగు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టు బెట్టాయి. శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

చ‌నిపోయిన ఉ్గ‌ర‌వాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. కొద్దిరోజుల క్రితం షోపియాన్ జిల్లాలో జిరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా ఎన్‌ కౌంటర్‌ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని, అదనపు బలగాలను రప్పించామని అధికారులు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని, మరికొంతమంది ఉగ్రవాదులు పట్టుబడే అవకాశం ఉన్నందునా.. అందుకోసం వేచి చూస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఉగ్ర కదలికలపై పక్కా సమాచారం అందడంతోనే రంగంలోకి దిగి కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -