Friday, May 17, 2024
- Advertisement -

ఢిల్లీలో వైసీపీ చేప‌ట్టిన ప్ర‌త్యేక‌హోదా ధ‌ర్నాలో పాల్గొన్న క‌త్తి మ‌హేష్‌…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో విపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌ర్యారు. ఈ ధ‌ర్నాకు సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కూడా పాల్గొన్నారు.

భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్న ఈ ధర్నాలో.. ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు’ అనే ప్లకార్డ్‌ను కత్తి మహేష్ ప్రదర్శించారు. దీంతో ఆయన ఏ పార్టీ వైపు ఉన్నారో తెలిసి పోయిందంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మార్చి 21న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 6న పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -