Thursday, May 2, 2024
- Advertisement -

ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీకి కేబినెట్ ఆమోదం

- Advertisement -

గత కొంత కాలంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో 30 శాతం పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. జూన్ నెల నుంచే పెంపును వర్తింపజేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది.

వాస్తవానికి మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. జులై నుంచి పెరిగిన వేతనం అందుతుంది. నేషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.

ఇక పెన్షనర్లకు 01-.04-.2020 నుంచి 31.-5.-2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.

విజయ్​ సేతుపతి వదులుకున్న పాత్రకు చైతూకి.. వర్కవుట్​ అవుతుందా?

బాలీవుడ్ లో తెలుగోళ్లు.. ఎవరంటే?

తండ్రైన నటుడు.. వైరల్ ఫోటోలు.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -