తెలుగులో మంచు ఫ్యామిలీకి ఉన్న పలుకుబడి గురించి వేరే చెప్పాల్సి అవసరం లేదు. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీల స్థాయిలో లేకున్నా మంచు వారి ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉన్నారు. ఇక మంచు మోహన్ బాబు మొదటి నుంచి కూడా రాజకీయాలకు దగ్గరగా ఉంటున్నారు.
అప్పట్లో తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు కూడా ఆయన కూతురు మంచు లక్ష్మీ రాజకీయాలపై ఆసక్తి చూపుతుంది. గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ వైకాపా వైపుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ లీడర్లు మంచు ఫ్యామిలీని బీజేపీ వైపుకు ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నాయి.
అందులో భాగంగా వారు సఫలం అయినట్లుగా కూడా తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంతో మాట్లాడి ఒప్పించి మంచు వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. మంచు లక్ష్మికి బీజేపీ టికెట్ కూడా దాదాపుగా ఖాయం అయినట్లుగా సమాచారం. మంచు వారి అమ్మాయికి రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న క్రమంలో బీజేపీ టికెట్ పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్కాగా కనిపిస్తోంది. మంచు లక్ష్మి పార్లమెంటుకు వెళ్లడం ఖాయం అని అంటున్నారు.
{youtube}aIVodS_T_E0{/youtube}
Related