కరోనా ఎఫెక్ట్తో థియేటర్లలో సినిమాలు చూసే భాగ్యమే లేకుండా పోయింది. కరోనా ఫస్ట్వేవ్ లాక్డౌన్తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఇక థియేటర్ల పనిఅయిపోయినట్టేనని.. ఓటీటీ యుగంలో థియేటర్లకు భవిష్యత్ ఉండదని వార్తలు వినిపించాయి. కానీ లాక్డౌన్ ఎత్తేశాక.. విడుదలైన సోలో బ్రతుకే సో బెటరు, క్రాక్, ఉప్పెన, వకీల్ సాబ్ వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. థియేటర్లకు ఇంకా భవిష్యత్ ఉందని నిరూపించాయి.
ఇదిలా ఉంటే వకీల్సాబ్ థియేటర్లలో ఉండగానే.. కరోనా సెకండ్వేవ్ ముంచుకొచ్చింది. దీంతో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. మొదటి వేవ్తోనే కుదేలైన థియేటర్ల యజమానులు.. రెండో వేవ్తో పూర్తిగా నష్టపోయారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ చేసుకొనేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా.. తెరిచేందుకు యజమానులు జంకుతున్నారు. త్వరలోనే థియేటర్లు ఓపెన్ అయ్యే చాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జూలై 30న నాని నటించిన టక్ జగదీశ్, సత్యదేవ్ నటించిన తిమ్మరసు విడుదల కాబోతున్నాయి.
Also Read: శంకర్ సినిమాలో చెర్రీ డ్యుయల్ రోల్ ?
రెండు చిన్న సినిమాలే కావడంతో.. కలెక్షన్లు ఏ మేరకు ఉంటాయో అన్న ఆసక్తి మొదలైంది. మరోవైపు కరోనా థర్డ్వేవ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిర్మాతల్లో గుబులు మొదలైంది. గత ఏడాది కరోనా అనంతరం విడుదలైన క్రాక్, సోలో బతుకే సో బెటర్ లాగే తమ సినిమాలు కూడా సక్సెస్ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఒకేరోజు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదల చేసుకొంటే ఇద్దరికీ లాభం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాలు ఏ మేరకు కలెక్షన్లు రాబడతాయో వేచి చూడాలి. కరోనాను లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తితే .. మరిన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలయ్యే చాన్స్ ఉంది.
Also Read: బజరంగీ బాయ్జాన్ 2 వచ్చేస్తోందా?