కరోనాతో చాలా ఎఫెక్ట్ అయిన దేశాల్లో మనదేశం కూడా ఒకటి. మొదటి వేవ్ కంటే.. రెండో వేవ్ సమయంలో భారత్లో కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఇక ఆక్సిజన్ అందక.. బెడ్డు దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా దహనాలు చేసేందుకు శ్మశానాల దగ్గర క్యూ కట్టే పరిస్థితి నెలకొన్నది. మనదేశంలోని దయనీయ పరిస్థితిపై అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇక కరోనా కట్టడికి మన ముందుకున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. కానీ మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరగలేదన్న విమర్శలు వచ్చాయి.
అవసరమైన మేరకు కరోనా టీకాల ఉత్పత్తి జరగలేదు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోలేదు. మనదేశంలో కోవాక్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి పంపిణీ సక్రమంగా జరగలేదు. దీంతో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియ ను ముమ్మరం చేసింది. శనివారం వరకు దేశ వ్యాప్తంగా 35 కోట్ల డోసులు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!
కరోనా సెకండ్వేవ్ ముప్పు కూడా దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది. ప్రస్తుతం దేశంలో 50 వేల లోపు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5 లక్షలకు దిగువన ఉన్నాయి. అయితే థర్డ్వేవ్ ముప్పు పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరం చేశారు. శనివారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా 57.36లక్షలకుపైగా వ్యాక్సిన్ మోతాదులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఒక్కరోజే దాదాపు ఆరు మిలియన్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించడం ఇదే తొలిసారి.
Also Read: ఫేషియల్ స్కానర్ కరోనాను పట్టేస్తోంది..!