Friday, March 29, 2024
- Advertisement -

ఓటేసిన సీఎం.. జోరుగా రెండో దశ..!

- Advertisement -

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాష్ట్ర సీఎం పినరయి విజయన్​.. కన్నూర్​ జిల్లాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

నాలుగు జిల్లాల(మలప్పురం, కోజికోడ్​, కన్నూర్​, కాసరాగోడ్​)లో మొత్తం 354 స్థానిక సంస్థల పరిధిలోని 6,867 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 10,842 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు​​. వీటిలో సమస్యాత్మకంగా ఉన్న 1,105 కేంద్రాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

గత వారం ఐదు జిల్లాల్లో జరిగిన రెండో దశ స్థానిక పోరులో 76.38శాతం పోలింగ్​ నమోదవ్వగా.. అంతకముందు తొలిదశ పోలింగ్​లో 72.67 శాతం మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ నెల 16 ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -