గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో.. 3వ నెంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూరు భాషా మస్తాన్వలి మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావటంతో.. వెంటనే పొన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మస్తాన్వలి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల మాత్రం చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి మాస్క్లు, చేతి తొడుగులు, శానిటైజర్ సిద్ధం చేశారు. కరోనా సోకిన వారు ఓటింగ్కి ఎక్కువ మంది వస్తే ఆ కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 14,535 మంది పర్యవేక్షకులు, మరో 37,750 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
భళా వాషింగ్టన్ సుందర్.. నమ్మకం నిలబెట్టుకున్నావు!
పాపం ఈ అమ్మడి ఆశలన్నీ దానిపైనే..