- Advertisement -
పాకిస్థాన్ ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లింది. దేశ రాజదాని సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఆకస్మిక పరిణామం వల్ల కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి పెద్ద నగరాలతో పాటు పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించటానికి గల కారణమేంటని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం, అధికారులపై విమర్శలు చేశారు.
జాతీయా విద్యుత్ సరఫరా వ్యవస్థ(ఎన్టీడీసీ)లో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగిందని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ హంజ షఫ్కత్ తెలిపారు. విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపారు మంత్రి. విద్యుత్తు శాఖతో పాటు పలు విభాగాలు సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.