Friday, May 17, 2024
- Advertisement -

రిపబ్లిక్ టీవీకి మరో షాక్.. డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్ శ్యామ్ సింగ్ అరెస్ట్!

- Advertisement -

అర్నాబ్ గోస్వామి అరెస్ట్ తో ఇప్పటికే షాక్ లో ఉన్న జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీకి మరో షాక్ తగిలింది. టీఆర్పీ రేటింగ్‌ను తారుమారు చేశారన్న ఆరోపణల కేసులో ఆ చానల్ డిస్టిబ్యూషన్ విభాగం అధిపతి ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టీఆర్పీ అవకతవలకు సంబంధించి తాజా అరెస్టును కలిపితే… ఇప్పటివరకు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీపై కొందరు వీక్షకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు.

తాము టీవీ చూడకపోయినా… రిపబ్లిక్ టీవీని ఆన్ చేసి పెట్టుకుంటే తమకు డబ్బులు చెల్లిస్తారని వారు చెప్పడంతో… మీడియా ప్రపంచంలో అలజడి చెలరేగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు.

అయితే ఆ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని మాత్రం ఓ ఇంటీరియల్ డిజైనర్, ఆయన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేశారన్న కేసులో అరెస్టు చేయడం జరిగింది.  అయితే అర్నాబ్ గోస్వామిని మాత్రం వేరే కేసులో అరెస్ట్ చేశారు. ఒక ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

బాబోయ్ పక్షి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి చేప.. అయినా..

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

చికెన్ చేసిన మాయ.. వింటే మీరు షాక్ తింటాారు!

ఛీ.. వీడు మనిషేనా.. కుక్కపై అత్యాచారం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -