ఎన్నో ఏళ్లుగా…అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న కావేరి జల వివాదం మరోసారి రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఈ రెండు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. 144 సెక్షన్ కర్ఫ్యూ విధించారు, ప్రస్తుతం సుప్రీం కోర్టు జోక్యంతో అంతా చల్లబడింది కానీ లోలోపల వివాదం చెలరేగుతూనే ఉంది.
ఈ విషయంపై జాతీయ నటుడు కమల్ హాసన్ ఘాటుగా స్పందించారు, అంతర్రాష్ట్ర జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందంటూ ట్విట్టర్ లో స్పందించాడు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆది మానవుల కాలంనుండి ఈ కావేరి జలాల వివాదం కొనసాగుతూనే ఉందని, ఇది నిన్న పుట్టింది కాదని, అలాగే రేపటితో ముగిసేది కాదని అయన ఘాటు కామెంట్స్ చేసాడు?
చరిత్ర అద్దంలో మన ముఖాలను ఇలాంటి పనులు చేసినవిగా చూసుకోవడం సిగ్గు చేటని కాస్త ఘాటుగానే స్పందించాడు కమల్!! మరి కమల్ కామెంట్స్ పై ఎదురు ఎలాంటి కామెంట్స్ పడతాయో చూడాలి !! ఈ విషయం పై ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు నటి నటులు కూడా స్పందిస్తున్నారు.
Related